EPS Pension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 (EPS-1995) కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే కరువు భత్యం (Dearness Allowance) అందించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ రూ.7500లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధరలకు ఇస్తోన్న కనీస పెన్షన్ రూ.1000 అనేది సరిపోవడం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరారు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్సభలోనూ చర్చకు వచ్చింది. పార్లమెంట్ సభ్యుడు రామ్వీర్ సింగ్ బిధూరీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంత మందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారు.కేంద్రం సమాధానం ఇదేఎంపీ బిధూరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లేజ్ సమాధానం ఇచ్చారు. కనీస ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారు. ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తోందని స్పష్టం చేశారు. ' ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33 శాతం కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుంది. అలాంటి లెక్కలన్నింటిని తీసుకుని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఈపీఎస్ 1995, ప్యారా 32
Actor ProfilePolitician
ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7500లకు పెంపు.. పార్లమెంటులో కేంద్రం ప్రకటన.. ఏం చెప్పిందంటే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Dec 2026
ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7500లకు పెంపు.. పార్లమెంటులో కేంద్రం ప్రకటన.. ఏం చెప్పిందంటే