ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక
Actor ProfilePolitician

ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక
TeluguOne14 Dec 2026
ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్ర నేతలతో ఒకే వేదికపై ప్రత్యక్షమైన పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకులతో కలిసి ఒకే వేదికపై ప్రత్యక్షమైన ఆయన షేక్ రషీద్ అహ్మద్ ఇండియాపై విషం కక్కారు. విద్వేష పూరిత వ్యాఖ్యతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు ఉగ్రవాదులతో ఒకే వేదికపై కూర్చుని భారత్ అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక బహిరంగ సభలో షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు. భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే.. ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడంటూ శాపనార్ధాలు పెట్టారు. భారత్‌పై దాడి జరిగితే అక్కడ పక్షులు కూయవని, ఆలయాల్లో గంటలు డా మోగవనీ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో తన ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉండటంతో అమెరికా అధికారులు తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని రషీద్ స్వయంగా వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు మంత్రిగా షేక్ రషీద్ కీలక