
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఈనెల 17 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సారి సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ఈ సారి కూడా హాజరుకాకూడదని ప్రతిపక్ష YSRCP నిర్ణయించింది. కేవలం మండలి సమావేశాలకు మాత్రమే హాజరవుతామంటోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను ఆదేశించారు. కాగా ఈ సారి అసెంబ్లీ ఆవరణలో డిజిటల్ పాస్లు జారీ చేయనున్నారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పాసుల స్కానింగ్ అనంతరమే ఎవరినైనా అనుమతిస్తారు. మరి ఈ సారి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఎల్లుండి జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సారి కొన్ని కీలకమైన బిల్లును పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయా బిల్లులు పాసయ్యే అవకాశాలున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి