
ఇరాన్ పై భారీ సైనిక చర్యలు చేపడతామని గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఈ వివాదం నుంచి సురక్షితంగా బయటపడేందుకు దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిని పూర్తికా తెరిస్తే.. అణు ఒప్పందం కుదరకపోయినా సరే దానినే పెద్ద విజయంగా ప్రదర్శించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. అణు ఒప్పందం లేకుండానే ఇరాన్ ఉద్రిక్తతల నుంచి వైదొలిగేలా డొనాల్డ్ ట్రంప్ తన సీనియర్ సహాయకులతో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తాజా షాక్..! ఇక వారందరికీ చెక్..!హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ప్రపంచ చమురు రవాణాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన హార్ముజ్ జలసంధిని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉండటం ఇరాన్ కు బలంగా మారింది. క్షిపణులు, డ్రోన్ దాడులకో వాణిజ్య నౌకలను అడ్డుకోవడం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో తీవ్ర అస్థిరత ఏర్పడింది. నావికా దిగ్బంధనాలు, సుంకాలు విధించడం ద్వారా అమెరికాను డిఫెన్స్ లో పడేసేందుకు ఇరాన్ ప్రయత్నించగా.. దానికి అమెరికా అంగీకరించనప్పటికీ.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది.ఇరాన్ పెట్టిన కఠినమైన షరతులు యుద్ధాన్ని ముగించి హార్ముజ్ జలసంధిని తెరవాలంటే అమెరికా కొన్ని కఠిన నిబంధనలను పాటించాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బాకర్ మాట్లాడుతూ.. అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఆ ప్రాంతం నుంచి తమ సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంక్షలు తొలగించి.. జప్తు చేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి ఇవ్వడమే కాకుండా యుద్ధ నష్టపరిహారం కూడా చెల్లించాలని షరతులు విధించారు.రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!అమెరికాపై పెరిగిన ఒత్తిడి మరోవై డొనాల్డ్ ట్రంప్ పై సొంతం దేశంలోనే తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉండటం