
ఇరాన్తో కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో కీలకమైన క్షిపణి నిరోధక వ్యవస్థలు (మిస్సైల్ ఇంటర్సెప్టర్లు), ఇతర ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని అమెరికా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి మార్క్ ఎస్పర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధ నిల్వలను వేగంగా భర్తీ చేయలేకపోవడం, ఇతర ముప్పులను ఎదుర్కోవడంలో సైనిక సంసిద్ధతపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.ట్రంప్ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ఎస్పర్, ఆదివారం ‘ఏబీసీ న్యూస్’తో మాట్లాడుతూ.. పేట్రియాట్, థాడ్ వంటి ఇంటర్సెప్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. "ప్రచ్ఛన్నయుద్ధం ముగిశాక తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడంతో ఈ పరిస్థితి మొదలైంది. గత ఆరు, ఏడు నెలలుగా ఇరాన్తో యుద్ధం వల్ల మన నిల్వలు మరింత తగ్గాయి" అని ఆయన వివరించారు. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గడం చైనాకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇది తమ దేశ నిరోధక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన చెందారు.క్షీణించిన నిల్వలను భర్తీ చేసేందుకు పెంటగాన్ అదనంగా 67 బిలియన్ డాలర్ల నిధులను కోరుతోంది. అయితే, ఇరాన్తో యుద్ధం ముగిసే వరకు అదనపు నిధులను వ్యతిరేకిస్తానని డెమొక్రాటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ తెలిపారు. "మనం దాదాపు అన్ని ఇంటర్సెప్టర్లను, తొమాహాక్లను వాడేశాం. ఇది అమెరికాను ప్రమాదకర స్థితిలో ఉంచింది" అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, రిపబ్లికన్ సెనేటర్ జిమ్ బ్యాంక్స్ ఇరాన్ విధానాలపై ట్రంప్ను సమర్థించారు. ఇరాన్ అణ్వాయుధం పొందకుండా నిరోధించడమే ట్రంప్ లక్ష్యమని అన్నారు.ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం