
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Indiramma Housing Scheme 2nd Phase: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉక్కు, సిమెంట్ పరిశ్రమలను ప్రభుత్వం కోరింది. పేదల గృహ నిర్మాణానికి మద్దతుగా ఉక్కు, సిమెంట్ ధరలను తగ్గించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల యజమానులను కోరారు. గురువారం సచివాలయంలో వివిధ ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం 100శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని.. ఇది దేశంలో మునుపెన్నడూ చూడని ఘనత అని పేర్కొన్నారు. నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తికి పారిశ్రామిక ప్రతినిధులు సానుకూలంగా స్పందించి, తక్కువ ధరలకు స్టీల్, సిమెంట్ సరఫరా చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తేనే మురికివాడలు లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధించగలమని వారు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఆమోదాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని, మూడవ, నాల్గవ దశలలో మరిన్ని ఇళ్లకు ఆమోదం తెలుపుతామని మంత్రులు తెలిపారు. ఇప్పటివరకు, ప్రభుత్వం మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా 450,000 ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం తెలిపింది. వీటిలో 85 శాతం ఇళ్లకు స్లాబ్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా పురోగమిస్తోంది. రెండవ దశ కింద రాష్ట్రవ్యాప్తంగా మరో