ఇంకా అందని చేయూత
Actor ProfilePolitician

ఇంకా అందని చేయూత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంకా అందని చేయూత
Andhra Jyothy9 Oct 2026
ఇంకా అందని చేయూత

తెరుచుకోని వెబ్‌సైట్‌ నూతన పింఛన్ల కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న కొత్తగా లక్ష పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా కొత్తగా అర్హులైన వందలాది మంది పింఛన్ల కోసం అర్జీలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చేయూత అందుతుందనే ఆశతో ఎదురుచూశారు. జూన్‌ 2న ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందారు. దరఖాస్తు చేసుకున్న వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమాల్లో కూడా అనేక మంది చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. 38 వేల మంది దరఖాస్తు జిల్లావ్యాప్తంగా దాదాపు 38 వేల మంది వరకు పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి దాదాపు 15 వేల మంది అర్జీలు పెట్టుకున్నట్లు తెలిసింది. వీరిలో అర్హులైన వారిని గుర్తించి కొత్తగా పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. మరోవైపు కొంత మంది ఇప్పటికీ సంబంధిత అధికారులకు దరఖాస్తు ఫారాలను అందిస్తూనే ఉన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 57 ఏళ్ళు నిండిన వారందరికీ వృద్దాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో 57 ఏళ్లు పైబడిన వారంతా పెన్షన్ల కోసం దరఖాస్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పెన్షన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాక పోవడంతో అప్పుడు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. నాలుగున్నరేళ్లుగా.. బీఆర్‌ఎస్‌ పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు.. మొత్తంగా నాలుగున్న రేళ్లుగా వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. ఎప్పుడు