
Eenadu•23 Dec 2026
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘స్త్రీ శక్తికి ఏడాది.. రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా సీఎం బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వార్త చదివారా: చేతిలో జాతీయ జెండా.. గుండెల్లో బలమైన అజెండా: చంద్రబాబు