
రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ... ఆక్వా, నాన్ ఆక్వా జోన్లు, 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అమలు రీ సర్వేతో కొత్తగా నోటిఫై చేసిన ఆక్వా జోన్లలోని అన్ని ఫారాలకూ.. 2018లోనే ఆక్వా రంగానికి విద్యుత్తు రాయితీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత జగన్ సర్కార్ అనాలోచిత నిబంధనలతో రైతులకు దక్కని రాయితీ కూటమి ప్రభుత్వం చొరవతో అధిక శాతం రైతులకు మళ్లీ ఊరట గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిబంధనలతో ఆక్వా రైతులు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది! ‘ఆక్వా’ రంగానికి తిరిగి జవసత్వాలు నింపుతూ ఓ కీలక వరం ఇచ్చింది!! ఉత్పత్తి వ్యయం తగ్గించేలా.. అర్హులైన రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. జగన్ సర్కార్ హయాంలో విధించిన ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల మెలిక, 10 ఎకరాల పరిమితి నిబంధనలను ఎత్తివేసింది. జూన్ 1 నుంచే విద్యుత్తు రాయితీ అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ.. యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్తు శాఖ మంగళవారం జీవో-57 విడుదల చేసింది. గత జగన్ సర్కార్ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటూ తీసుకొచ్చిన మెలిక, అలాగే 10 ఎకరాల పరిమితి నిబంధనతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచే