
దివంగత రెబల్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, ఆయన మరణానంతరం తమ జీవితాన్ని, ఆయన జ్ఞాపకాలను కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు గారి జీవితం సినిమా రంగం, రాజకీయాలు అనే రెండు పడవల ప్రయాణంలా సాగిందని, ఈ రెండింటినీ ఆయన ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం తర్వాత, తాను, పిల్లలు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లు శ్యామల దేవి వెల్లడించారు. ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి నెలకొందని ఆమె ఆ సమయంలో పడిన వేదనను తెలిపారు. ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి అలాంటి క్లిష్ట సమయంలో ఆమె కుమారుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సలహా ఆమె జీవితానికి ఒక కొత్త దిశను చూపిందని తెలిపారు. "మీకు పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మన దగ్గరే ఉన్నారు. సంపూర్ణమైన జీవితం అనుభవించి, ఆయన మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరు బాధపడ్డారు, రోజు బాధపడుతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్తున్నారు అంటే ఆయనని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదనాన్న ఉన్నట్టుగా చూపించాలి కదా. మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరికి రారు. అప్పుడు పెదనాన్న మీ దగ్గర లేనట్టే కదా. ఆయన ఉన్నారు, మనతోనే అనుకుంటే మీరు లేవాలి, తిరగాలి, బయటికి వెళ్ళాలి" అని తన కుమారుడు చెప్పిన మాటలు తనను ఆలోచింపజేశాయని అన్నారు. ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్ ఆ మాటలతో ప్రేరణ పొందిన శ్యామల దేవి, బాధపడే కన్నా కృష్ణంరాజు గారి జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ, నలుగురిలోకి వెళ్తే వారు కూడా ఆనందపడతారని