తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో, విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ . కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. గత కొన్ని దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇటీవల కేంద్రప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ని అందజేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత 'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సన్మానించింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''48 ఏళ్ల సినీ జీవితంలో ఒక కళాకారుడుగా నేను సినిమాల్లో యాక్ట్ చేసినప్పటి నుంచి నా బిహేవియర్లో ఎలాంటి మార్పు లేదు. నేను ఒక నటుడ్ని అని నేను ఎప్పుడూ గర్వం చూపించలేదు. నాకు ఇప్పటి వరకు కాంట్రవర్సీలు లేవు. ఈ మధ్య కాలంలో అదేదో ట్యూబులో.. టైర్లో ఏవో వచ్చాయి కదా. కొత్తగా లేటెస్ట్గా ఏమన్నా నా అంతలా నవ్వించడం వారికి చేతకాదేమో. దానికి నేనేమి చెయ్యాలి. నన్ను ఎవరైనా తప్పుగా అర్ధం చేసుకుంటే, అది వాడి ఖర్మ. నేనేమీ చేయలేను. నిజమే 'పద్మశ్రీ' రావడం ఆలస్యమైంది. ప్రతి తెలుగు వారి ఇంట్లోను రాజేంద్రప్రసాద్ ఉన్నారు. నేను ఐదు జనరేషన్లు దాటి వచ్చాను. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు నుంచి.. ఇప్పటి మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకూ.. అందరికీ పరిచయం ఉన్నాను. అదే మనకి దేవుడు ఇచ్చిన ప్రసాదం. నాకోసం ఇప్పుడున్న దర్శకులు బాధ్యతతో మంచి మంచి క్యారెక్టర్లు రాస్తారు. ఎక్కడా రిలాక్స్ అయ్యే మనస్తత్వం కాదు నాది'' అని అన్నారు. ''ఇప్పటి వరకూ నా కెరీర్ లో కష్టం అనిపించిన క్యారక్టర్ ఒక్కటి కూడా
Actor ProfileActor
ఆ నలుగురు’ చూసి కె.విశ్వనాథ్ నన్ను చెంప మీద కొట్టారు.. ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Sept 2026
ఆ నలుగురు’ చూసి కె.విశ్వనాథ్ నన్ను చెంప మీద కొట్టారు.. ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశా