అర్హులందరికీ రేషన్ కార్డులు.. నిరంతర ప్రక్రియ
Actor ProfilePolitician

అర్హులందరికీ రేషన్ కార్డులు.. నిరంతర ప్రక్రియ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అర్హులందరికీ రేషన్ కార్డులు.. నిరంతర ప్రక్రియ
AP7AM24 Dec 2026
అర్హులందరికీ రేషన్ కార్డులు.. నిరంతర ప్రక్రియ

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని, ఇది ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రజలకు నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసేవారని, అయితే తమ ప్రభుత్వం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి సన్న బియ్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రతకే కాకుండా, అది ఒక కుటుంబానికి ప్రభుత్వం కల్పించే గౌరవం, గుర్తింపు అని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి, త్వరలోనే వారికి కూడా కార్డులు జారీ చేస్తామని మంత్రి