
కావలి : సామాజిక మాధ్యమాల్లో తమ కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని దగదర్తి తెదేపా నాయకులు మాలేపాటి లోకేశ్ వాపోయారు. సోమవారం కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్లను కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సొంత పార్టీ వారే వేధిస్తుండటం బాధాకరమన్నారు. కట్టడి చేయాల్సిన పోలీసు అధికారులు మిన్నకుంటున్నారని ఆవేదన చెందారు. ఈ దుస్థితితోనే తన తండ్రి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సుబ్బానాయుడితోపాటు అన్న భానుప్రకాశ్లు మృత్యువాత పడ్డారని, అయినప్పటికీ వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో అశాంతి, ఘర్షణలకు తావిస్తుందన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు