
Eenadu•2 Oct 2026
అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలుఅయోధ్య రామాలయంలో విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ వివరాలను అధికారులు యూపీ ప్రభుత్వానికి అందించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు విరాళాలు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. ఈ సమయంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు