
Eenadu•20 Oct 2026
అప్పటి నుంచి పుచ్చకాయ తినడం మానేశాఆహార కల్తీ ఎన్నో జబ్బులకు కారణమవుతోందని సినీ నటి కాజల్ (Kajal) అన్నారు. చాలా మంది యువతులు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశాన్ని ‘ది ఇండియా స్టోరీ’ సినిమాతో ఆమె తెరపైకి తీసుకురాబోతున్నారు. చెట్టన్ డీకే తెరకెక్కించిన ఈ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా కాజల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘‘కథ కోసం రీసర్చ్ చేయగా చాలా విషయాలు బయటపడ్డాయి. అవి చూసి షాకయ్యా. ప్రస్తుతం ప్రతి ఇంట్లో క్యాన్సర్ సాధారణమైపోయింది. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశా’’ అని కాజల్ చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో చూడండి. ఈ వార్త చదివారా: ‘జననాయగన్’.. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులివే