ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్లో ఎన్నికల నిర్వహించాల్సి వస్తోంది. గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సి నిధులు కోల్పోయే పరిస్థితి ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అక్టోబరులో ఎట్టిపరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. ఒకవేళ నిర్వహించలేకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.కేంద్రం నుంచి రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది.. నిధులు ఐదేళ్లలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు 16వ ఆర్థిక సంఘం సుమారు రూ.16,600 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,150 కోట్లు రావాలి. ఈ నిధులు రావాలంటే కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందేనని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సిందేనని.. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబందించి 2021లో గ్రామాల విలీనం చేశారు. కానీ ఈ అంశం కోర్టుకు చేరడంతో 23 చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి ఆ 23 చోట్ల కూడా నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీని కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా చేయాలని సూచించారు. ఒకవేళ కుదరని పక్షంలో విలీన గ్రామాలనున పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పోలింగ్ బూతులు, ఓటర్ లిస్టులు, వార్డులకు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్లో కచ్చితంగా ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఈ కసరత్తును వేగవంతం చేశారు. మున్సిపల్ ఎన్నికలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిని విడివడిగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి సమయం కూడా తక్కువగా ఉంది. కేవలం రెండు
Actor ProfilePolitician
అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?.. లేకపోతే ఏపీకి రూ.28 వేల కోట్లు లాస్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jan 2027
అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?.. లేకపోతే ఏపీకి రూ.28 వేల కోట్లు లాస్