
అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. *నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైంలో నాకు సురేష్ బాబు గారు, శిరీష్ గారు, బెక్కెం వేణు గోపాల్ గారు సహాయం చేస్తున్నారు. మేమంతా కష్టపడి సినిమాని తీశాం. మేం ఒంటరిగా పోరాడుతున్నాం. మా ఈ పోరాటంలో మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పిన కథను భిక్షు తెరపైకి అద్భుతంగా తీసుకు వచ్చారు. రుద్ర సాయి గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి ఓ పిల్లర్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్ శివకు థాంక్స్. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. *అన్ష్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని తొడ గొట్టి చెబుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్లో జరిగిన ఓ ఆడిషన్కి వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ముందుకు కదిలాను. కళామతల్లికి కిరీటంలా కాకపోయినా పాదాల వద్ద పుష్పాన్ని అయితే చాలని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు మాకు