హెలికాప్టర్ ఆపితే.. రైల్లో వస్తారు
Actor ProfilePolitician

హెలికాప్టర్ ఆపితే.. రైల్లో వస్తారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హెలికాప్టర్ ఆపితే.. రైల్లో వస్తారు
AP7AM26 Oct 2026
హెలికాప్టర్ ఆపితే.. రైల్లో వస్తారు

ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్ చేపట్టబోయే భీమవరం పర్యటనను కూటమి ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకవేళ హెలిప్యాడ్‌కు పర్మిషన్ ఇవ్వకపోతే.. జగన్ రైలు ఎక్కైనా సరే భీమవరం వచ్చి రైతులను కలుస్తారని తేల్చిచెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో ఈరోజు జరిగిన ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు.న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆక్వా రైతాంగం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని మండిపడ్డారు. ఆక్వా మేత ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. మేత కంపెనీల యాజమాన్యాలు, పాలకులు చేతులు కలపడం వల్లే పెట్టుబడి వ్యయం పెరిగిపోయి రైతులు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆరోపించారు. ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు జులై 15వ తేదీన జగన్ భీమవరం రావడం ఖాయమైందని పేర్ని నాని వెల్లడించారు. ఈ పర్యటనను ఫ్లాప్ చేయడానికి లేదా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, కుతంత్రాలు చేసినా జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. "కూటమి ప్రభుత్వం హెలిప్యాడ్‌కు అనుమతులు నిరాకరిస్తే నిరాకరించుకోవచ్చు. జగన్ అవసరమైతే సామాన్యుడిలా రైల్లో ప్రయాణించి అయినా సరే ఇక్కడికి చేరుకుంటారు. రైతులను కలిసి వారి సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేలా పోరాడుతారు" అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, లేదంటే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు