సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా
Actor ProfilePolitician

సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా
Asianet News Telugu2 Jan 2027
సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా

తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తమదైన ప్రతిభతో, నటనతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ మహానటి సావిత్రి. తెలుగు సినిమాకు దొరికిన వరం సావిత్రి. నేటితరం హీరోయిన్లకు ఆమె ఆదర్శం. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు తెలుగుతెరపై మెరిశారు. కానీ సావిత్రిని మించి నటించగలిగే వారు మాత్రం ఇంత వరకూ రాలేదు. సౌందర్య, స్నేహా లాంటి హీరోయిన్లు్ సావిత్రిలా అనిపించినా.. ఆమెను మించిన అద్భుతాలు మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు హృదయాలలో సావిత్రి స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమెను తమ మనసుల్లో పదిలపరుచుకున్నారు ప్రేక్షకులు.చివరి రోజుల్లో నరకం చూసిన సావిత్రి.. కోమాలోకి వెళ్లి.. దాదాపు 14 నెలలు అచేతనంగా ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో సావిత్రిని చూసి బోరున విలపించింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు జమున. సావిత్రితో పాటు ఆతరం హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకన్న వారిలో జమున కూడా ఉన్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన, అన్యోన్యమైన ఆత్మీయ అనుబంధం ఉండేది. ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లకంటే ఎక్కువ క్లోజ్ గా ఉండేవారు. సావిత్రి జీవితంలో చెలరేగిన తుపానులను జమున ఆపలేకపోయింది. ఎన్ని సార్లు చెప్పినా.. పట్టుదలతో సావిత్రి తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితంపై వ్యతిరేక ప్రభావం పడేలా చేశాయి. ఇక సావిత్రి గురించి జమున గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ బిషయాలు వెల్లడించారు. ' సావిత్రితో తనకున్న మైత్రిని, ఆమె చివరి రోజుల్లో ఎదురైన తీవ్ర విషాద సంఘటనను పంచుకున్నారు. సావిత్రిగారి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, జెమిని గణేషన్ ని వివాహం చేసుకోవడం, ఆ తరువాత ఆమె మద్యం అలవాటుకు బానిస కావడం వంటి విషయాలపై హోస్ట్ ప్రశ్నించగా జమున స్పందిస్తూ, "సావిత్రి నాతో ఆ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ