
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పండుగ విడుదల ప్రాజెక్ట్పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. విడుదలైన పోస్టర్లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్ కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పుడు పూర్తి షూటింగ్ విజయవంతంగా ముగియడంతో, చిత్ర నిర్మాతలు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి, తమ దృష్టిని పోస్ట్-ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారు. భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ నిర్మాణ ప్రయాణం ఇప్పుడు పూర్తిస్థాయిలో ముగిసింది, ఇది చిత్ర బృందానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇందులో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం, దీని పాన్-ఇండియా ఎట్రాక్షన్ ను మరింత పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్