
అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపిన ఆటోడ్రైవర్ భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి (32) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతవాణి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఆమె తాడేరులో ఉంటోంది. మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్యాంబాబుతో ఆమెకు ఐదేళ్ల క్రితం పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారి వారిమధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. శ్యాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. కాగా.. ఆరు నెలలుగా శ్యాంబాబును అనంతవాణి దూరం పెడుతూ వస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న శ్యాంబాబు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తాడేరులోని ఆమె ఇంటికి వెళ్లి కత్తితో అనంతవాణిపై దాడి చేశాడు. ఛాతీ, కడుపుపై పొడిచి పరారయ్యాడు. తండ్రి వెంకటేశ్వరరావు స్థానికుల సాయంతో అనంతవాణిని భీమవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు) బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) అదరగొట్టిన ఆసీస్.. 7వ సారి T20 వరల్డ్ కప్ ప్రశ్న రావణ్ చచ్చిపోవాలి అంటా..? 20 మంది పెద్ద పెద్ద లాయర్లను పెట్టి.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్ 14 రోజులు రిమాండ్.. నెల్లూరు జైలుకు ప్రశ్న రావణ్ రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో