
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.తాజా సర్ తుది జాబితాతో సంబంధం లేకుండా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలు అక్టోబర్ 3వ తేదీన ప్రచురితమవుతాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేస్తే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.2025 నాటి జాబితాతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయంఈ క్రమంలోనే సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి జాబితాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్టోబర్లో ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పురపాలక, నగర పంచాయతీలలో, నగరపాలక సంస్థ ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాలో ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి.రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు.జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం మునిసిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా, ఇప్పటివరకు