
Puthur: స్త్రీ శక్తి బస్సులో సాధారణ ప్రయాణికుడిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ Puthur: పల్లె వెలుగు బస్సులో సామాన్యుడిలా ప్రయాణించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. బస్సులో పుత్తూరు నుంచి వడమాలపేట వరకు మహిళలతో కలిసి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ప్రయాణం. ఈ సందర్బంగా ప్రయాణంలో ఉచిత ఆర్టీసీ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల కుటుంబాలకు ఆర్థిక లబ్ధి, ప్రయాణ సౌలభ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయం మహిళా సాధికారతపై టీడీపీకి అంకితభావానికి మరొక నిదర్శనమని మహిళల పట్ల సీఎం చంద్రబాబు గారికి ఉన్న గౌరవం, నమ్మకం అని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. శ్రీ శక్తి పథకం -మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్బంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం పుత్తూరు నుండి వడమాలపేట వరకు స్త్రీ శక్తి బస్సు లో ప్రయాణం చేశారు.ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.బస్సులో ఉన్న మహిళల తో ఉచిత బస్సు ప్రయాణం పైన ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం ద్వారానే స్త్రీ శక్తి మహాశక్తిగా రూపొందుతుందని. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకూ బలంగా నమ్ముతారు.ఈ దిశగానే మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు