
ములుగు: మేడారంలో వనదేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లాలో సీఎం పర్యటించారు. తొలుత మేడారంలో పర్యటించిన సీఎం.. వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు చేరుకుని గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లాలో రూ.868 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర మొదలు పెట్టాం. పోరాటానికి, పౌరుషానికి మారుపేరైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పాదయాత్ర చేపట్టాం. ప్రజల సమస్యలు తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చాం. మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తాం. జంపన్న వాగును కూడా నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తాం. ములుగు ప్రాంత అభివృద్ధికి ఏం కావాలో చెబితే నిధులు మంజూరు చేస్తాం. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నాం. కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు.. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌస్లో పడుకున్నారు. సొంత బిడ్డను ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతుంటే మౌనంగా ఉన్నారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లే. అలాంటి తండ్రీకుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు. ఇంకొకరు అఘోరారావు.. అఘోరా పూజలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నారు. దేవుడు మనవైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. ములుగు అంటే గతంలో అభివృద్ధి లేని ప్రాంతం అనేవారని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఈ