
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా మూడు మ్యాచుల్లో విఫలం కావడంతో సంజు శాంసన్ను టీమ్ఇండియా (Team India Lost) మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. జింబాబ్వే సిరీస్కూ ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ప్రపంచ కప్లో హీరో అయిన సంజును అలా ఎలా పక్కన పెడతారంటూ నెట్టింట కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Head Coach Gautam Ganbhir) మౌనం వీడాడు. సంజును తప్పించడానికి గల కారణాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లోనూ భారత్ ఓడిన అనంతరం గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టులో నుంచి ఎందుకు తప్పించామనే విషయంపై సంజు శాంసన్ (Sanju Samson)కు నా వైపు నుంచి స్పష్టత ఇచ్చాను. అది కేవలం ప్రధాన కోచ్, ప్లేయర్కు మధ్య జరిగిన సంభాషణ. ఆ వివరాలను బయటకు వెల్లడించలేను. సంజు వ్యవహారంలో మేం క్లారిటీగానే ఉన్నాం. భారత జట్టుకు అతడు చేసిన దేనినీ మరిచిపోలేం. అయితే, ఏదైనా సిరీస్కు ఎంపిక చేసేటప్పుడు సదరు ప్లేయర్ ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. సంజు మళ్లీ పుంజుకుని ఇదే సిరీస్లో పునరాగమనం చేయొచ్చు. వరల్డ్ కప్ ముందు అతడు ఇబ్బంది పడిన సందర్భాలనూ చూశాం. కానీ, ఆ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు’’ అని గంభీర్ (Gautam Gambhir) తెలిపాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో జట్టు కూర్పు సమస్య కాదు. ఫలితమే ముఖ్యం. ఫైనల్ XIలో ఎవరు ఉన్నారనేదానికంటే మనం విజయం సాధించామా? లేదా? అనేది చూడాలి. టీమ్ఇండియా కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జట్టులో స్థానం దక్కుతుంది. అయితే, ఐర్లాండ్తోపాటు ఇంగ్లాండ్లో (India vs England) పరిస్థితులను అలవర్చుకోవడంలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం చూశాం. ఇంకా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వరుసగా మేం నాలుగు మ్యాచుల్లో ఓడిపోవడానికి ఇవే కారణాలుగా భావిస్తున్నాం’’ అని గంభీర్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ