
నటీనటులు : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి, ఆశిక్ రెడ్డి తదితరులు దర్శకత్వం : ఉదయ్ చౌహన్ సంగీతం : పవన్ సి హెచ్ నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఛాయాగ్రహణం : వినోద్ కే బండారి కూర్పు : సృజన అడుసుమిల్లి ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చిన పలు చిత్రాల్లో ఓ చిన్న చిత్రం ‘పళ్ళ బురుసు’ కూడా ఒకటి. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో మురళీ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. తెలంగాణలోని చిన్న కుగ్రామంకి చెందిన శంబో (సుధాకర్ రెడ్డి) తనకి పంటి నొప్పి ఉండడంతో తనకి ఓ మంచి పళ్ళ బురుసు (పంటి బ్రష్) వాడమని డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) కి ఆ పళ్ళ బురుసు, మందులు కొనమని చెప్తాడు. కానీ ఈ పంచాయితీ మరో రీతిలోకి వెళ్లేలా పరిస్థితులు మారుతాయి. దీనితో తన కొడుకు తనకి పళ్ళ బురుసు కొనివ్వలేదు, ఇంకా మరికొన్ని కారణాలు చెప్పి కేసు వేస్తాడు శంబో. ఇంకోపక్క తన తండ్రి పేరిట ఉన్న ఎకరా పొలాన్ని అమ్మి తన అప్పులు తీర్చుకోవాలని తిరుపతి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరు తండ్రీ కొడుకులు తగాదాలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు? అసలు శంబో కేసు వేసింది కేవలం చిన్నపాటి పంటి బ్రష్ కొనివ్వలేదు అనేనా? లేక మరో కారణం ఉందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక వయసు వచ్చాక ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తారో అనే పాయింట్ ని దర్శకుడు డీసెంట్ ఎమోషన్స్ తో ఇందులో ప్రెజెంట్ చేయడం బాగుంది. దీనితో పాటుగా ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగి మనిషికీ