
హైదరాబాద్: సాయిదుర్గా తేజ్ (Sai Durgha Tej) కథానాయకుడిగా రోహిత్.కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarla Yeti Gattu). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న (sambarala yeti gattu release date) సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘రూ.125 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. పీరియాడిక్ కథతో ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్ని పంచేలా తెరకెక్కిస్తున్నాం. భారీ హంగులతో చిత్రీకరిస్తున్న ఈ మూవీ తెలుగుతోపాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోవిడుదల కానుంది’ అని సినీ వర్గాలు తెలిపాయి. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బి.అజనీశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘మీరందరూ మృత్యువును మోసగించి ఇన్నాళ్లూ బతికారు. కానీ, ఇప్పుడు ఆ మృత్యువును తప్పించుకోలేరు’ అంటున్నాడు విక్టర్. ఇంతకీ విక్టర్ ఎవరు? అతడు ఏ విధ్వంసం సృష్టించనున్నాడు? అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ కొరియన్ కనకరాజు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు వరుణ్ తేజ్