
Eenadu•30 Nov 2026
స్కేటింగ్ చేస్తూ బోనమెత్తిన చిన్నారిజోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బుర్ధపేట కాలనీకి చెందిన తన్విక (9) అమ్మవారిపై భక్తిని.. తన స్కేటింగ్ నైపుణ్యంతో చాటుకుంది. వీర, ప్రశాంతి దంపతుల కుమార్తె తన్విక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. సోమవారం బోనాల పండగ సందర్భంగా పట్టణంలోని కృష్ణానది నుంచి స్కేటింగ్ చేస్తూ తలపై బోనం పెట్టుకొని సుంకులమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించింది. ఆలయం వద్ద చిన్నారి నైపుణ్యం చూసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆమెను అభినందించారు. ఈ వార్త చదివారా: సాగర్ తీరంలో మహా వరుణయాగం