
ప్రముఖ పంజాబీ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంఝ్ నటించిన ‘సత్లజ్’ చిత్రం మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ఎన్నో ఏళ్ల నిరీక్షణ, సెన్సార్ అడ్డంకుల తర్వాత జులై 3న 'జీ5' ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే, విడుదలైన 48 గంటల్లోపే భారతదేశంలో ఈ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ చిత్రం అందుబాటులో ఉండదని 'జీ5' ప్రకటించింది. ఈ పరిణామం పంజాబ్లో రాజకీయ దుమారం రేపడంతో పాటు ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కొత్త చర్చకు దారితీసింది.ఈ వివాదం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రంగు పులుముకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. సినిమా తొలగింపు వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆప్ ఆరోపిస్తుండగా, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ హయాంలో సిక్కు సమాజంపై జరిగిన అఘాయిత్యాల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు, ఈ సినిమాను పంజాబ్లోని ప్రతీ గ్రామం, పట్టణంలో ప్రదర్శిస్తామని ఆయన ప్రకటించారు.సినిమా తొలగింపుపై కేంద్రం వాదన‘సత్లజ్’ సినిమాను నిలిపివేయడం వెనుక బలమైన కారణాలున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈ చిత్రం కేవలం కొందరు అధికారుల తప్పులను విమర్శించడానికే పరిమితం కాలేదని, వేల సంఖ్యలో జరిగిన అదృశ్యాలు, హత్యలకు ప్రభుత్వమే బాధ్యురాలని చూపే ప్రయత్నం జరిగిందని