
జలాశయంలో ప్రస్తుతం 169 టీఎంసీలే 40 వేలకుపైగా క్యూసెక్కులతో తెలంగాణ విద్యుదుత్పాదన ఏపీ వాడుకున్నది 9,718 క్యూసెక్కులు సాగర్కు 50,673 క్యూసెక్కులు విడుదల శ్రీశైలం/విజయపురి సౌత్/అచ్చంపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో వా రం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.20 అడుగులకు తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 169 టీఎంసీలే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కుడి, ఎడమగట్టు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఏపీ కుడిగట్టున 9,718 క్యూసెక్కుల నీటిని వినియోగించగా, ఎడమ గట్టున తెలంగాణ 40,955 క్యూసెక్కులు వాడింది. సోమవారం మొత్తంగా 50,673 క్యూసెక్కులను దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేశా రు. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం బాగా తగ్గిపోయింది. ఆలమట్టి నుంచి 23,325 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. నారాయణపూర్ నుంచి 20,783 క్యూసెక్కులు జూరాలకు వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 37,313 క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్కు విడుదల చేశారు. తుంగభద్రకు 16,923 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 7880 క్యూసెక్కులు వదులుతున్నారు. వార్తలు కూడా చదవండి... నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ Read Latest AP News And Telangana News And National News And Telugu News