
సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలోని ఒక సీన్ వెనుక ఉన్న రియల్ ఇన్సిడెంట్ గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. మనం స్క్రీన్ మీద చూసి భావోద్వేగానికి గురయ్యే సీన్స్ వెనుక దర్శకులు తమ నిజ జీవితంలో చూసిన, అనుభవించిన ఘటనలు ఉంటాయి. వెంకీ అట్లూరి రాసిన ఒక డ్రైవర్ ఇంటర్వ్యూ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే అసలు ఆ సీన్ రాయడానికి ఇన్స్పిరేషన్ దిల్ రాజు అని వెంకీ తెలిపారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. 2012-2013 ప్రాంతంలో తాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గర పనిచేస్తున్నప్పటి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో SVC బ్యానర్ కాస్త క్లిష్టమైన పరిస్థితులలో ఉంది. అదే సమయంలో సెట్స్లో పనిచేసే ఒక లైట్మ్యాన్, తన కొడుకుకి యూఎస్లోని కాలేజీలో సీటు వచ్చిందని, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆర్థిక సాయం కావాలని కోరాడు. ఆ రోజుల్లో ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజుకి అది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, ఇచ్చినా మాట ప్రకారం ఆ పిల్లాడి ట్రావెల్ కు అయ్యే డబ్బులు తక్షణమే చెల్లించి సహాయం చేశారు. ఒక సాధారణ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం పడే తపన, ఆయనకు అండగా నిలిచిన మనుషుల మంచితనం.. ఈ ఘటనే వెంకీ అట్లూరి మనసులో బలంగా నాటుకుపోయింది. అదే ఆ ఎమోషనల్ సీన్ రాయడానికి ప్రధాన ఇన్స్పిరేషన్గా మారింది. అంతేకాదు, సినిమాలో ప్రతీ ఎమోషనల్ కన్వర్జేషన్ తర్వాత వాతావరణాన్ని తేలికపరచడానికి చిన్న జోక్