
‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు స్వాగతం సంప్రదాయబద్ధంగా వాటర్ క్యానన్ సెల్యూట్ వారికి ఏటికొప్పాక బొమ్మలతో పాటు సర్టిఫికెట్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సర్వీసులు ‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయనగరం/విశాఖపట్నం/భోగాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇక్కడి నుంచి స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. అయితే ల్యాండ్ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందినది. 177 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ విమానం సోమవారం ఉదయం 6-45గంటలకు ఎయిర్పోర్టులో దిగింది. ఆ విమానంలో వచ్చిన వారు ల్యాండింగ్ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులికించిపోయారు. భోగాపురం వినువీధుల నుంచి రయ్మంటూ వచ్చిన విమానాన్ని చూసి స్థానిక ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బ య్యారు. కొత్త విమానాలు వచ్చినప్పుడు విమానాశ్రయాల్లో వాటికి అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలుకుతారు. భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది వాటర్ క్యానన్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ల్యాండయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, స్కూట్ (సింగపూర్), ఇండియా వన్ విమానాలకూ ఈ గౌరవం లభించింది. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమాన ప్రయాణికులకు చిన్న ఏటికొప్పాక