
8th Pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన కమిషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో కమిషన్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఉద్యోగ నిబంధనలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది పెరిగితే ప్రాథమిక వేతనం (బేసిక్ పే) కూడా పెరుగుతుంది. అదే జీతాల పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉద్యోగ సంఘాలు ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 6వ వేతన కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉండగా, 7వ వేతన కమిషన్లో అది 2.57గా నిర్ణయించారు. దీంతో కనీస ప్రాథమిక వేతనం రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. అయితే 8వ వేతన కమిషన్లో ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందనే విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిపుణుల అంచనాల ప్రకారం ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.90 నుంచి 2.86 మధ్య ఉండే అవకాశం ఉంది. కొందరు నిపుణులు 2.28 నుంచి 2.86 వరకు ఉండొచ్చని చెబుతుండగా, మరికొందరు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే 2.10 కంటే ఎక్కువ ఉండే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు.అయితే ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మాత్రమే మొత్తం జీతాన్ని నిర్ణయించదు. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పిల్లల విద్యా అలవెన్స్, ఇతర భత్యాలు, వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కూడా మొత్తం వేతనంపై ప్రభావం చూపుతాయి అయినా ఈ అలవెన్సులన్నీ కూడా సవరించిన బేసిక్ పే ఆధారంగానే లెక్కిస్తారు. అందువల్ల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటే, అలవెన్సులు పెరిగినా దాని ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. భువనేశ్వర్ సమావేశాల తర్వాత జూలై 9, 10 తేదీల్లో కోల్కతాలో మరో విడత సంప్రదింపులు జరగనున్నాయి. ఆ తర్వాత కూడా