
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్ర ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన


దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్ర ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ గేయం వందేమాతరం ఆలాపనను ఆపాల్సిందిగా అక్కడి సిబ్బందికి చేత్తో సంజ్ఞలు చేస్తోన్నట్లు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే విధమైన సైగలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం ఖర్గే.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడుతుండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. దేశ విభజనకు ముందు ఉన్న నాటి పాత మనస్తత్వమే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం పట్ల ఏ మాత్రం భక్తిభావం లేదని, విభజించి పాలించు దోరణిని కనపర్చుతోందని మండిపడ్డారు.ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిదిఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఖర్గే కోసం ఆమె ఓ కుర్చీని తీసుకుని రావాలంటూ ఆమె సిబ్బందిని కోరుతూ చేతిని ఊపారని వివరణ ఇచ్చింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఎక్కువ సేపు నిల్చోలేకపోయారని, ఇబ్బంది పడటాన్ని గమనించిన సోనియా గాంధీ ఆయన కూర్చోవడానికి కుర్చీని తీసుకుని రావాలంటూ అక్కడి సిబ్బందికి చేత్తో సైగలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని కూడా