
ఏపీలోని రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అవసరమైన డీపీఆర్ లను తయారు చేసి ఆమోదించడంతో పాటు భూసేకరణ వరకూ వెళ్లింది. ఇలాంటి తరుణంలో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు (Vijayawada Metro Rail Project) నిర్మాణంపై మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఓ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు.కూటమి సర్కార్ లో సూపర్ సీఎం ? ఏ మంత్రి నిర్ణయం అయినా వీటో చేసే అధికారం..!విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తాజాగా భూమిని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు రాకతో నగరం రూపు రేఖలు మారిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. నగరంలోని ఏలూరు, బందరు రోడ్లలో రెండు కారిడార్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల పాత విజయవాడ నగరం హైదరాబాద్ తరహాలో పూర్తిగా మారిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వీటినే ఇంకాస్త ముందుకు తీసుకెళ్తూ కేశినేని నాని.. ఇవాళ ఈ ప్రాజెక్టు నగరానికి వరమా లేక శాపమా అనే ప్రశ్న సంధించారు. ఇంత చిన్న నగరానికి మెట్రో అవసరమా అని ఇప్పటికే ప్రశ్నిస్తున్న వారి వాదనకు కేశినేని ప్రశ్న ఊతమిచ్చేలా ఉంది. Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!రెండే ప్రధాన కమర్షియల్ రోడ్లు -బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు మాత్రమే వున్న విజయవాడ నగరానికి, విజయవాడ ప్రజలకు విజయవాడ మెట్రో రైల్ వరమా లేక శాపమా ? అని మాజీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు పెట్టారు. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ప్రాజెక్టు వరమని, ఇంకొందరు శాపమని స్పందిస్తున్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుతో రాకతో నగరంలో జరిగే మార్పుల వల్ల ఎలాగో కొందరికి నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో వారిని