
నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై రచించిన వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నెల్లూరు, జులై 05: తన అభ్యర్థనతో ఆంధ్రప్రదేశ్కు 7 లక్షల టిడ్కో ఇళ్లు కేటాయించిన గొప్ప నేత భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఆయనకు ఉన్న అపారమైన అనుభవంతో రాజ్యసభలో ఎన్నో కీలక బిల్లులు పాస్ చేయించారని వివరించారు. ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. ఆయన నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేసుకున్నారు. ఆదివారం నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై రచించిన వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడుతో తమ కుటుంబానికి 50 సంవత్సరాల ఆత్మీయ అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఆయన ఎన్నో రాజకీయ సలహాలు ఇచ్చారని చెప్పారు. పదవులకే ఆయన అలంకారమని పేర్కొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చూసిన ఎత్తులు పల్లాలు ఎవరూ చూసి ఉండరని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మీ ఆత్మకథ రచయితగా తనకు అవకాశం ఇవ్వాలని వెంకయ్యనాయుడిని ఆయన కోరారు. కఠోర సత్యాలతో కూడిన డాక్యుమెంటరీ చేసే ఛాన్స్ కూడా తనకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. మీ వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకొని తాను ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు. పెద్దన్నతో దశాబ్దాల అనుబంధం: ఎమ్మెల్యే సోమిరెడ్డి తమ పెద్దన్న వెంకయ్యనాయుడితో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి





