వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ కోకాపేట, పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసాలతో పాటుగా ఆయన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలస్తోంది. ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అంతేకాదు అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారనే ప్రచారం జరరుగుతోంది.ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రమే కాదు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పులివెందులలోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తొండూరు మండలం టి తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు పులివెందులలోని వైఎస్ జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈడీ ఏ కేసుకు సంబంధించి ఈ తనిఖీల చేపట్టిందనేది క్లారిటీ రావాల్సి ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ఇళ్లలో సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అందుకే వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ కేసును సీబీఐ విచారణ చేయగా.. ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందనే కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈడీ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈడీ
Actor ProfilePolitician
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Jan 2027
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. మరో నలుగురు ఇళ్లలోనూ తనిఖీలు