
తెలుగు సినీ చరిత్రలో సూపర్స్టార్ కృష్ణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అన్నింటిని ఎదుర్కొని నెంబర్ వన్ అయ్యారు. వాటిలో ఒకటి వరుసగా 15 చిత్రాల పరాజయం. ఏ హీరోకైనా ఇదొక పెను సవాలు, కెరీర్కు మరణశాసనం లాంటిది. కానీ కృష్ణ, తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ కష్టకాలాన్ని అధిగమించి తిరుగులేని హీరోగా నిలబడ్డారు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే హీరోలకు అవకాశాలు తగ్గడం, నిర్మాతలు వెనకడుగు వేయడం చూస్తుంటాం. అలాంటిది "అల్లూరి సీతారామరాజు" లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వరుసగా 15 సినిమాలు అపజయం పాలయ్యాయి. కనీసం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితిలో చాలా మంది సినీ ప్రముఖులు కృష్ణకు సినీ పరిశ్రమను వదిలిపెట్టి వేరే వ్యాపారం చూసుకోమని సలహా ఇచ్చారట. ఈ మాటలు ఏ హీరోనైనా కుంగదీస్తాయి. కానీ కృష్ణ నిరాశ చెందలేదు, పడ్డ చోటు నుంచే లేచి నిలబడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఆయన సినీ ప్రస్థానంలో ఒక విలక్షణమైన పంథాను అనుసరించారు. ఇతర హీరోల మాదిరిగా స్క్రిప్ట్లలో జోక్యం చేసుకోకుండా, దర్శకుల విజన్ను గౌరవించేవారు. దర్శకుడికే అన్నీ తెలుసు అని నమ్మి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఈ స్వేచ్ఛే ఆయన్ను సూపర్స్టార్గా నిలబెట్టింది. అయితే, వరుస పరాజయాల కారణంగా ఏ నిర్మాత కూడా కృష్ణను నమ్మి సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. ఈసడింపు మాటలు కూడా వినిపించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తానే స్వయంగా నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నారు. తన సొంత బ్యానర్ పద్మాలయా మూవీస్ను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా కృష్ణ తొలిసారిగా నిర్మించిన చిత్రం పాడిపంటలు. ఈ సినిమాపై మొదట్లో ఎటువంటి అంచనాలు లేవు. పదిహేను ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో విజయంపై ఎవరికీ నమ్మకం