
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు కు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది కలిపి మొత్తం చెల్లింపు దిశగా కసరత్తు చేస్తున్నట్లు


ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు కు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది కలిపి మొత్తం చెల్లింపు దిశగా కసరత్తు చేస్తున్నట్లు

TGSRTC లో పోస్టుల భర్తీకి తుది కసరత్తు జరుగుతోంది. కొత్తగా 1500 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో.. పదో తరగతి అర్హతగా ఈ పోస్టుల భర్తీకి రంగం సిద్దం అవుతోంది. పదిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు ఔట్ సోర్సింగ్ పద్దతిలో కండక్టర్ల ను నియమిస్తూ వచ్చిన ఆర్టీసీ.. ఇప్పుడు పూర్తి స్థాయిలో నియామకం పైన ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్దం చేసింది.TGSRTC లో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీ చేపట్టి చాలా ఏళ్లు అయింది. ఇప్పటికే చాలా మంది కండక్టర్లు రిటైర్డ్ అయ్యారు. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా నిర్వహించనుంది. ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా నిర్ణయించారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక, ప్రభుత్వ అనుమతి లభించడంతో నోటిఫికేషన్ విడుదలకు ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో కండక్టర్ పోస్టులను పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేసేవారని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయనున్నారు కానీ.. ఆ తర్వాత విద్యాశాఖ జీపీఏ గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. మళ్లీ ఇటీవల మార్కుల విధానం అమల్లోకి వచ్చింది. దీంతో, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. భీమ్రెడ్డి జాబితాలో సినీ హీరో - రూ.3 కోట్ల అడ్వాన్స్, అగ్రిమెంట్..!?ఆర్టీసీ అధికారుల తుది కసరత్తుపది మార్కులే ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయాల్సి ఉండటంతో.. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.