
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ATM Money Problems: ఓ వైపు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరగడం.. దీంతో చాలా చోట్ల ఏటీఎమ్ల వల్ల బ్యాంకులకు అనవసరపు భారం అనుకున్నారేమో.. దీంతో వాటి సంఖ్యను బాగా కుదించారు. ముఖ్యంగా కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలు చిన్న పట్టణాల్లోని ఏటీఎంలో బ్యాంకులు వెంటనే సరిపడ నగదు నిలువలు ఉంచడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు నెలలుగా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని ద్వితీయ శ్రేణి నగరాలు చిన్న నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో నగరాల్లోని బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఏటీఎం లో నగదు కొరత మరింత తీవ్రంగా కనిపించింది. కొన్ని నగరాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు వాటి సగటు సామర్థ్యంలో 57 నుంచి 64% మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ కూడా గత నెలలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. ఈ నగదు కొరత నగదు నిర్వహణ కంపెనీల వ్యాపారాన్ని దెబ్బ తీస్తోంది. ఏటీఎంలో నింపడానికి బ్యాంకుల నుంచి తమకు సరిపడ నగదు అందక నష్టపోతున్నట్టు ఈ కంపెనీలు చెబుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకులు తమ కష్టాలను వెల్లగక్కుతున్నాయి. బ్యాంకులకు సంబంధించిన శాఖ ఉండే నగదు నిలువలన్నీ ఏటీఎం లో నింపేందుకు పనికి రావని స్పష్టం చేస్తున్నాయి. అందులో చినిగిపోయిన నోట్లు చలామణికి పనికి