
రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారూ... వీరిలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లున్న వారు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించనివారు కూడా.. 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,73,616 మంది వివరాలు డిజిటైజ్.. ఇది మొత్తం ఓటర్లలో 78.26 శాతం 94.31 శాతంతో భువనగిరి టాప్.. హైదరాబాద్ లాస్ట్ రాజధానిలో ఏకంగా 20 లక్షల ఓట్లు ఏఎ్సడీ జాబితాలో 17న ముసాయిదా.. లిస్టులో పేరు లేకపోతే మళ్లీ చాన్స్ అప్పటికీ ఫారాలు, ఆధారాలు ఇవ్వకపోతే ఓటు ఔట్ హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారూ ఉన్నారా!? ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు జాబితా నుంచి పోనున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ముగిసింది. ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. వాటి డిజిటైజేషన్ ప్రక్రియ 78.26 (2,64,73,616 మంది) శాతమే పూర్తయింది. మిగిలిన 73,52,832 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎ్సడీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలో చేర్చారు. అంటే, చనిపోయిన వారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోనివారు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు 20 లక్షల మంది ఈ జాబితాలో ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలో 27.89 లక్షల (58.89 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేశారు. 19.46 లక్షల (41.11 శాతం) ఏఎ్సడీ జాబితాలో చేర్చారు. అలాగే, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి అగ్రస్థానంలో ఉంటే, హైదరాబాద్ చివర్లో ఉంది