
రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాయలసీమను గాలికొదిలేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "వంద పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు.ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఏమయ్యారు?వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వందలాది కుటుంబాలు వీధిన పడినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు యాత్ర చేయలేదని భూమిరెడ్డి ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అప్పుడే తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. గోరకల్లు, అలగనూరు రిజర్వాయర్ల కట్టలు కుంగిపోయినా కనీసం మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని, వీటిపై వైసీపీ నేతలు ఎందుకు పాదయాత్రలు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తుంటే, వైసీపీ నాయకులు నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు.ఒక్క కలం పోటుతో 102 ప్రాజెక్టులకు అడ్డుకట్టరాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం గత టీడీపీ






































.webp)






