
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణసమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత