
గంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ జలాశయంలో భాగంగా రూ.20 కోట్లతో కుడి కాలువ, 11 ఉప కాలువలు పూర్తి చేసి 27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న కుడి కాలువను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా వదిలేసిన కాలువలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నారాయణపూర్ జలాశయం కట్ట ఎత్తు పెంచి అభివృద్ధి చేయడం ద్వారా అదనంగా లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు