
రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో ముగిసిన రెన్యువల్ గడువు.. ప్రీమియం చెల్లించని ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నేపథ్యంలో నిర్ణయం నవంబరు 19 నుంచి ఇందిరమ్మ బీమా.. రైతులతోపాటు అన్ని కుటుంబాలకూ వర్తింపు! హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులతోపాటు అన్ని కుటుంబాలకు జీవితబీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే, రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఎనిమిదేళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. 18-59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున రూ.1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా గడువు శుక్రవారంతో ముగిసింది. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. 2018లో రైతుబీమా పథకం ప్రారంభం కాగా.. 2018-19లో 17,747 మంది, 2019-20లో 19,063 మంది, 2020-21లో 29,163 మంది, 2021-22లో 23,393 మంది, 2022-23లో