రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం
Actor ProfilePolitician

రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం
Zee Telugu26 Nov 2026
రైతన్న క్షేమం కోసం.. నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Varuna Yagam in Nagarjuna Sagar: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని, వానాకాలం పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో నాగార్జునసాగర్ పవిత్ర కృష్ణానది తీరంలో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో వర్షాల తీరు, వాటి పంపిణీ ఆశించినంత స్థిరంగా లేదన్నారు. వ్యవసాయానికి ఒకటి రెండు సందర్భాల్లో కురిసే భారీ వర్షాల కంటే పంట కాలమంతా అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడం అత్యంత ముఖ్యమన్నారు. వర్షాల మధ్య సుదీర్ఘ విరామాలు ఏర్పడితే పంటల ఎదుగుదలతో పాటు సాగునీటి అవసరాలపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న ఎల్‌నినో (El Niño) పరిస్థితులను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా గమనిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గత రెండు నెలలుగా తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైందని, రాబోయే నెలల్లోనూ సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వానాకాలం పంటలకు, సాగునీటి లభ్యతకు సవాలుగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ సాగునీటి భద్రత రాష్ట్రంలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉండదని, రాష్ట్ర జీవనాడులైన కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు కూడా