రాజీవ్ గాంధీకి ఘన నివాళి
Actor ProfilePolitician

రాజీవ్ గాంధీకి ఘన నివాళి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
రాజీవ్ గాంధీకి ఘన నివాళి
Andhra Jyothy23 Jan 2027
రాజీవ్ గాంధీకి ఘన నివాళి

పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు, కార్యకర్తలు ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించిన దార్శనిక నాయకుడని కొనియాడారు. రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తారీక్‌, భీంరావు, బాబాపూర్‌ సర్పంచ్‌ రాజన్న, నాయకులు అసద్‌, చిట్ల నారయణ, మారుతి, శంకర్‌, ఇమ్రాన్‌, కలీం, నిఖిల్‌, కాశన్న తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి ఆదిత పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహ్మద్‌ సుజాయిత్‌ ఖాన్‌, సీనియర్‌ నాయకులు సిడాం జగన్నాథ్‌, రాథోడ్‌ రోహిదాస్‌, గోగర్ల రాజయ్య, జాదవ్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం

రాజీవ్ గాంధీకి ఘన నివాళి
Eenadu21 Jan 2027
రాజీవ్ గాంధీకి ఘన నివాళి

పర్లాఖెముండి: దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని, దేశ సమగ్రతను కాపాడేందుకు అమరుడయ్యారని కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు బసంత్‌ పండా అన్నారు. గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు కృషి చేసి, పునాదులు వేసిన నాయకుడు అని కొనియాడారు. అదేవిధంగా సుస్థిర పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటర్, సెల్ ఫోన్ టెలికాం, ఐటీ రంగాలను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ర జ వ గ ధ క ఘన న వ ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in