
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ktr fires on brs and bjp govt in independence day speech: దేశ వ్యాప్తంగా 80 వ ఇండిపెండెన్స్ డే సంబరాలు అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడింది. ప్రజలంతా జాతీయజెండాను ఎగుర వేసి తమ దేశం పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హమీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంను మరోసారి కేటీఆర్ నిలదీశారు. ఇండిపెండెన్స్ వేళ కూడా కాంగ్రెస్, బీజేపీలపై ఘాటైన విమర్శలతో కేటీఆర్ చుక్కలు చూపించారు. సీఎం రేవంత్ తరచుగా 18 గంటలు పని చేస్తున్నట్లు చెప్తున్న డైలాగ్ పై పంచ్ లు వేశారు. సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు .. కొండల్ రెడ్డి కొండలు ఎలా కొల్లగొట్టాలి?.. తిరుపతి రెడ్డికి భూములు గుంజుకొని ఎలా ఇవ్వాలి?.. అల్లుడికి ఆస్తులు ఎలా ఇవ్వాలి?.. జగదీశ్వర్ రెడ్డికి ఆస్తులు ఎలా ఇవ్వాలి?.. ఇలా నీ ఫ్యామిలీని అదాని కుటుంబం కంటే పెద్దది ఎలా చేయాలనే ఎజెండాలో నువ్వు పని చేస్తున్నావ్ అంటూ కేటీఆర్ ఏకీపారేశారు. మన భారతదేశంలో దాదాపు 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఇంటింటికి తాగునీరుతో సహా ప్రతి ఎకరాకు సాగు నీరు ఇచ్చేందుకు 40 వేల టీఎంసీలు చాలన్నారు. కానీ 80 ఏళ్లు అయినా నీటిని