
Kiara Advani:యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలోని రొమాంటిక్ సీన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కియారా భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. కియారా అద్వానీ నటించిన టాక్సిక్ సినిమాలోని ఇంటిమేట్ సీన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా యశ్తో ఆమె చేసిన సన్నివేశాలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కియారాకు భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండగా నిలిచారు. ఆమె నటనను, సినిమా కోసం చేసిన కష్టాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాక్సిక్ ట్రైలర్పై స్పందించిన సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ సినిమా కోసం కియారా పడిన శ్రమ, పట్టుదల, అభిరుచి తెరపై స్పష్టంగా కనిపించబోతున్నాయని ప్రశంసించారు. టాక్సిక్ ఆమె కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే దర్శకురాలు గీతూ మోహన్దాస్, యశ్తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. టాక్సిక్లోని తబాహి పాట విడుదలైన తర్వాత కియారా, యశ్ మధ్య ఉన్న సన్నిహిత సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు విమర్శలు చేయగా, మరికొందరు మాత్రం సినిమాలోని పాత్రకు అనుగుణంగానే కియారా నటించారని సమర్థిస్తున్నారు. బెంగళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యశ్ కూడా కియారాకు మద్దతుగా నిలిచారు. ఒక నటిగా ఎదురయ్యే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాను నమ్మిన పాత్రను నిజాయితీగా చేయాలని ఆమెకు సూచించారు. కియారా తన పాత్ర పట్ల ఎంతో అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. యశ్, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది