
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పార్టీలోని పలువురు సీనియర్లు తమ అసంతృప్తిని ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూనే ఉన్నారు. అయితే, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధిష్ఠానం లేదా టీపీసీసీ నాయకత్వం నుంచి హెచ్చరికలు వస్తున్నా, వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తనదైన శైలిలో మరింత ఘాటుగా స్పందిస్తూ ఆయన పార్టీ నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు. పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్లో బయటి నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం పెరిగిపోయిందని బాహాటంగానే ఆరోపించారు. ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులు, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రభుత్వం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఏపీకి తగినట్లు విధానాలు ఉన్నాయనేది ఆయన ప్రధాన అభియోగం. ఈ విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రితో సహా ఎవరినీ సహించేది లేదు’ అని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి హెచ్చరికల తర్వాత నేతలు వెనక్కి తగ్గడం చూస్తుంటాం. కానీ రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు సరికదా, మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా తిప్పికొట్టారు. “నాకు నీతులు చెప్పే బదులు ముందు సీఎం రేవంత్ రెడ్డికి నీతులు చెప్పు” అంటూ నేరుగా నాయకత్వానికే చురకలంటించారు. పీసీసీ చీఫ్ హెచ్చరికలను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఇచ్చిన కౌంటర్తో స్పష్టమైంది. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చేరికల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ